హైదరాబాద్ ఎల్బీనగర్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ప్రమాదవశాత్తు కూలింది.సాగర్ రింగ్ రోడ్లో నిర్మిస్తున్న ఫైఓవర్ పిల్లర్ టూ పిల్లర్ స్లాబ్ చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న GHMC,DRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తామన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఇంజినీర్ల బృందం..ఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలించింది.