విశాఖలో సంచలనం సృష్టించిన బెంగాల్ విద్యార్థిని రీతి సాహా మృతి కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్తో పాటు.. సాధన హాస్టల్ యజమాని, వార్డెన్ కుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే రీతి సాహా చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నీట్ శిక్షణ కోసం కోల్కతా నుంచి విశాఖ వచ్చి చదువుకుంటున్న రీతి సాహా.. జులై 14న హాస్టల్ టెర్రస్పై నుంచి పడి సాహా మృతి చెందింది.