విశాఖ అనకాపల్లి మధ్య తాడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. గూడ్స్లో బొగ్గు ఉన్న కారణంతో, హైడ్రాలిక్ జాకీల సహాయంతో వేగన్స్ని పట్టాలపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీంతో అటు వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.