జగన్ ప్రభుత్వానికి గౌతు లచ్చన్న లాంటి వ్యక్తిని గౌరవించుకునే కనీస సంస్కృతి లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాంమోహన్ నాయుడు అన్నారు. గౌతు లచ్చన్న విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. శ్రీకాకుళంలో సర్ధార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రైతుల కోసం ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకు సర్దార్ పాదయాత్ర చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన నిరంతరం పాటుపడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నిర్వీర్యం చేస్తోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.