సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రజలకు సూచించింది. అయితే... ఈ పథకం దరఖాస్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇవాళే చివరి రోజు కావడంతో.. మరింత సమయం కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.