Gandhi Mandela Award: మెంచు, గొంజాలెజ్‌కు గాంధీ-మండేలా అవార్డు

గ్వాటెమాలా మానవ హక్కుల ఉద్యమకారిణి రిగోబెర్టా మెంచు టుమ్‌;

Update: 2024-07-21 01:15 GMT

 గ్వాటెమాలా మానవ హక్కుల ఉద్యమకారిణి రిగోబెర్టా మెంచు టుమ్‌, మెక్సికో రాజకీయ నేత, వ్యాపారవేత్త విక్టర్‌ గొంజాలెజ్‌ టొర్రెస్‌లకు గాంధీ-మండేలా పురస్కారం లభించింది. ఆదివాసీల హక్కుల కోసం మెంచు నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు 1992లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. గొంజాలెజ్‌ ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీరికి ఈ పురస్కారాన్ని గాంధీ-మండేలా ఫౌండేషన్‌ శుక్రవారం మెక్సికోలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. గాంధీ, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా చెప్పిన అహింస విలువలను ప్రచారం చేయడం, ప్రోత్సహించడం కోసం ఈ ఫౌండేషన్‌ ఏర్పాటైంది.

Tags:    

Similar News