కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో విషాదం చోటు చేసుకుంది. తోటల్లో అడవి పందులు వేటాడేందుకు లోడ్ చేసి ఉన్న నాటు తుపాకీ మిస్ ఫైర్ అయింది. దీంతో నాలుగేళ్ల ధన్యశ్రీ అనే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులో తీసుకున్నారు.