తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డికి మంత్రి హరీష్రావు సవాల్ విసిరారు. బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టలేదని.. రాష్ట్రానికి రావాల్సిన 35వేల కోట్లను కేంద్రం ఆపింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిజం కాకపోతే మీటర్లు పెట్టిన పక్క రాష్ట్రాలకు డబ్బులు ఎలా ఇచ్చారని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు ఆపారో కిషన్రెడ్డి చెప్పాలన్నారు. ఒకరేమో 3 గంటల కరెంట్ చాలంటారు.. ఇంకొకరేమో మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారని హరీష్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాత్రం 3 పంటలు పండాలని కోరుకుంటున్నారని చెప్పారు.