అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శబరి గోదావరి సంగమంలో రెండు నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. వీఆర్ పురం మండలం అన్నవరం వాగు పొంగడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం వద్ద గోదావరి నది, చింతూరు వద్ద శబరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.