బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనర్హత తీర్పులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కృష్ణమోహన్రెడ్డిని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించింది. ఇటీవల గద్వాల ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నియమిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో కృష్ణమోహన్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ వేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎమ్మెల్యేపై హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ అనర్హత వేటు వేశారు.