విశాఖలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పలువురిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీతో పాటు లెఫ్ట్ నేతల్ని గృహనిర్బంధం చేశారు. విశాఖ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు సీఐటీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, సీఐటూయు నేత మణిని గృహనిర్బంధం చేశారు.