భార్యను వేట కొడవలితో నరికి చంపేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటనలో లక్ష్మీ దేవి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాపూజీ పార్క్ వద్ద భార్యతో భర్త రఘు గొడవ పడ్డాడు. అనంతరం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె రోడ్డుపైకి రావడంతో కొడవలితో వెంటపడి నరికి చంపడానికి ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకున్నా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు.