ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తహసీల్దార్, భూ నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సచివాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేయగా... భూ నిర్వాసితులు తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని తహసీల్దార్ని కోరారు. ఇక తహసీల్దార్ భూ సేకరణ జరగడం లేదనడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో జగన్ హామీ ఇచ్చారంటూ భూ నిర్వాసితులు తహసీల్దార్కు గుర్తు చేశారు. గతేడాది కలెక్టర్ కూడా హామీ ఇచ్చారని చెబుతున్న భూ నిర్వాసితులు.. ఇప్పుడు తహసీల్దార్ సంబంధం లేదడనడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.