అనకాపల్లి జిల్లా చోడవరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల తీవ్ర అవస్థలకు గురయ్యారు. కొంతమంది స్థానిక నాయకుల మెప్పు పొందేందుకు చోడవరం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు మండుటెండలో అవస్థలకు గురి చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకు వేడుకలను ప్రారంభించలేదు. అత్యుత్సాహంతో విద్యార్ధులను మండుటెండలో నిలబెట్టారు. ఎండతాపం తట్టుకోలేక అవస్ధలు పడ్డారు. అంతకు ముందు జూనియర్ కాలేజీ వద్ద నుంచి స్ధానిక శివాలయం వరకు 600 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.