వికారాబాద్ జిల్లా పరిగిలో కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళాను నిర్వహించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళాకు నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతి, యువకులు భారీగా తరలివచ్చారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు మేళాలో పాల్గొన్నారు. నిరుద్యోగుల అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలను ఆఫర్ చేశారు. జాబ్మేళా అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కాసాని వీరేష్ పిలుపునిచ్చారు. పరిగి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. వందకుపైగా కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.