తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ప్రజాధనాన్ని కొల్లగొట్టింది - కిషన్రెడ్డి
తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ప్రజాధనాన్ని కొల్లగొట్టిందన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిందంటూ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్లో కేంద్రమంత్రి కిషన్కు రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. దళితుల భూముల్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారంటూ ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు కిషన్ రెడ్డి. అంతకు ముందు చౌటుప్పలో సర్దార్ సర్వాయి పాపన్న 373 జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.