కోడికత్తి కేసులో తమ బిడ్డకు బెయిల్ ఇవ్వాలంటూ శ్రీను కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఏడుసార్లు బెయిల్ పిటిషన్ను తిరస్కరించాయి కోర్టులు. ఇప్పటి వరకు విజయవాడలో జరిగిన కేసు విచారణ.. ఇక నుండి విశాఖలో జరగనుంది. మరోవైపు శ్రీనివాస్ని కావాలనే సర్కార్ వేధిస్తోందిని ఆరోపిస్తున్నారు. జగన్ చేతిలో శ్రీనివాస్ భవిష్యత్ ఉందని.. తమకు మద్దతిచ్చిన దళిత సంఘాల నేతలను అరెస్ట్ చెయ్యడం దారుణమని శ్రీనివాస్ తల్లి,సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.