కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్ . ప్రగతి భవన్ జరిగిన కార్యక్రమంలో బీజేపీ వంద అబద్దాలు పేరుతో బుక్లెట్, సీడీ విడుదల చేశారు.ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.9 ఏళ్లలో మోదీ సర్కార్ వంద లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు.2023లో జీడీపీలో కేంద్ర ప్రభుత్వం అప్పు 58 శాతమన్న కేటీఆర్..కేంద్రం కంటే తెలంగాణ ఎంతో ఉత్తమంగా ఆర్ధిక సమతూల్యం పాటిస్తుందని అన్నారు.