కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ను జైల్లో ఎందుకు పెడతారో చెప్పాలంటూ క్వశ్చన్ చేశారు. జేపీ నడ్డా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ను విమర్శిస్తే ప్రజలు ఆదరించరని తెలంగాణను మరింత ప్రేమిస్తే ప్రజలు ఆదిరిస్తారని గుర్తించుకోవాలన్నారు. అంబర్పేట్ ఫ్లై ఓవర్ ఏమైందో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.