తెలంగాణలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందన్నారు మంత్రి కేటీఆర్. మొబిలిటీ రంగంలోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. గిగా కారిడార్లో భాగంగా హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి భూమి పూజ చేశారు. భారీ పెట్టుబడులు పెడుతున్న జయదేవ్ గల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు కొత్తదనం ఉండేలా అమరరాజా కృషి చేస్తుందన్నారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు దేశంలోనే తయారవుతాయన్నారు.