అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. రాజకీయాల్లో ఉప్పు..నిప్పుగా ఉండే నేతలు అప్యాయంగా పలకరించుకున్నారు. ఈటల రాజేందర్ సీటు వద్దకు వచ్చి అప్యాయంగా పలకరించారు మంత్రి కేటీఆర్. ఈటలను ఆలింగంనం చేసుకున్నారు వారిద్దరూ 10 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. మంత్రి ఛాంబర్లో ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పిల్లలతో కలిసి తిరిగితే ఎలా అని కేటీఆర్ అంటే టీషర్ట్తో వస్తే తప్పులేదన్న అంటూ జగ్గారెడ్డి సమాధానం ఇచ్చారు.