సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అప్పు చేసి పేదలకు డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. పన్నులు రూపేణా రెట్టింపు దండుకోవటం సంక్షేమ పాలనా అని ప్రశ్నించారు. జగన్ నొక్కే బటన్కు కరెంట్ లేదు... ఆ బటన్ ఎన్నిసార్లు నొక్కినా డబ్బులు పడవన్నారు. జగన్ చర్యలతో ఏపీ పరువుపోయిందన్నారు. ఏపీలో ఎక్కడ చూసిన భూ కబ్జాలు, మట్టి దోపిడీనే ఉందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు అనివార్యమని చెప్పారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో లోకేష్ రచ్చబండ నిర్వహించారు.