నారా లోకేష్ యువగళం పాదయాత్ర టీడీపీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర మంగళవారం మంగళగిరి నియోజవర్గంలోకి ప్రవేశించనుంది. లోకేష్కు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. స్వాగత సన్నాహక కార్యక్రమంలో భాగంగా నియోజవర్గంలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది.. యువగళం స్టిక్కర్లతో ఉన్న కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరిలో ఈ ర్యాలీ కొనసాగింది. ఇప్పటికే నియోజవర్గంలో లోకేష్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు.