పల్నాడు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు. ప్రస్తుతం గురజాల నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెయ్యిమంది మహిళలతో లోకేష్కు స్వాగతం పలుకుతున్నారు. కేరళ డప్పులు, సంప్రదాయ నృత్యాలతో పాదయాత్ర ఓ పండుగలా కొనసాగుతోంది.