వివేకాహత్య కేసు ఎఫ్ఐఆర్లో భారతి పేరును సీబీఐ చేర్చిందని.. అందుకే ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ వెళ్లారని లోకేష్ ఆరోపించారు. కుటుంబం సభ్యుల పేర్లు తప్పించేందుకే జగన్ ఢిల్లీ టూర్ అంటూ మండిపడ్డారు. తమ పేర్లను చేర్చకుండా ఉండేందుకే జగన్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి హస్తిన వెళ్లారని లోకేష్ అన్నారు. బాబాయ్ మర్డర్ జగనాసుర రక్త చరిత్రగా పేర్కొన్న లోకేష్.. జగన్ శాశ్వతంగా ఇడుపులపాయ ప్యాలెస్కే పరిమతం అవుతారన్నారు.