మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్ చంద్రునాయక్, మరో స్థానిక నేత నెహ్రూ నాయక్లు టికెట్ కోసం పోటీ పడున్నారు. వీరితో పాటు మరో యువనేత భూపాల్ నాయక్ పోటీకి సిద్ధమవుతున్నారు. భూపాల్ నాయక్... ఇప్పటికే కిసాన్ పరివార్ పేరిట రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా పై వ్యతిరేకత, కాంగ్రెస్లో ఉన్న ఇద్దరు నేతల్లోనూ సఖ్యత లేకపోవడం తనకు కలిసివస్తాయంటున్నారు భూపాల్ నాయక్.