మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ నేతలు పోటీపడుతుండగా... ఇప్పుడు భూపాల్ నాయక్ సైతం పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ సారి కచ్చితంగా డోర్నకల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తామంటున్నారు భూపాల్ నాయక్.