తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పూజలు పునస్కారాలతో కళకళలాడుతున్నాయన్నారు. అర్చకులకు సైతం ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు జగదీష్ రెడ్డి. యాదాద్రి దేవాలయం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా నల్గొండ శివారులోని పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.