కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ అన్నింటిని అమ్మేసి చేనేతలను ఇబ్బంది పెడుతుంటే.. తమ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్క్ని పునరుద్ధరించి నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పోచంపల్లి నేతన్నలు చేనేతల అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ హ్యాండ్లూమ్ పార్కుకు శంకుస్థాపన చేసి చేనేత వారోత్సవ సభలో పాల్గొన్నారు.