నేడు మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 53కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జీవధాన్ స్కూల్ ప్రాంగణంలో 35వేల మందితో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి రానుండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9కి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు కామారెడ్డికి చేరుకుంటారు.