Khammam Rains: మున్నేరు వాగు ఉగ్రరూపం; బాధితలకు మంత్రి భరోసా

Update: 2023-07-29 08:49 GMT

ఖమ్మంలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్‌తో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గతంలో ఎప్పుడు లేనంతగా మున్నేరు వాగుకు వరద వచ్చిందన్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇక్కడ నిర్మించాల్సింది కరకట్ట కాదని.. ఆర్‌సీసీ వాల్ నిర్మించాలన్నారు. 146 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో అది తామే నిర్మిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 

Tags:    

Similar News