దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. అమరవీరుల దినోత్సవాన్ని ఖమ్మంలో నిర్వహించారు. మయూరి సెంటర్లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఉన్న ఉద్యమ ట్యాగ్లైన్ను పరిపూర్ణం చేస్తూ ముందుకు వెళుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.