మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉండగా రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. శిథిలాల నుంచి 17 మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిజోరంలో రైల్వే వంతెన దుర్ఘటనపై ఆరాష్ట్ర సీఎం దిగ్ర్భాంతి వ్యక్తి చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.