పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. 35 ఏళ్ల వయస్సులోనే విష్ణువర్దన్ రెడ్డి మృతి చెందడంతో.. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి హరీష్రావు.. విష్ణువర్దన్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. హరీష్రావుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు.