బీఆర్ఎస్ పార్టీ రైతు ప్రభుత్వమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా కేసీఆర్ అండగా నిలబడుతున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలో వ్యవసాయ యాంత్రికరణ కోసం 75 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. 50శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్ల అందజేస్తున్నామని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.