అధికార బీఆర్ఎస్లో వర్గ పోరు ఉధృతంగా సాగుతోంది. సిట్టింగులకు ఫిట్టింగ్ పెట్టేందుకు ఆశావాహులు సిద్దమయ్యారు. ఉత్తర తెలంగాణలో గ్రూపు కొట్లాటలు తారాస్థాయికి చేరాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా ఆశావహులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అసమ్మతి నేతల తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. పనితీరు సరిగా లేని 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ అని ఇప్పటికే సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. సిట్టింగులపై అసమ్మతి నేతల్ని అధిష్టానమే ప్రోత్సహిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. సర్వేల ఆధారంగా సిట్టింగ్లకు పోటీగా నేతల్ని సైలెంట్గా తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది.