విశాఖలో ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని కంప్లైంట్ చేశారు. విశాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, బీఎల్ఓలపైన ఫిర్యాదు చేశారు. బూతు లెవల్ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, వీరి తీరుపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. తాత్కాలిక వలసలు పేరుతో ఓట్లు తొలగించడం దారుణమని అన్నారు. అధికార పార్టీ ఇప్పటివరకు BLA లిస్ట్ ఇవ్వలేదని మండిపడ్డారు.