Kavitha: కాంగ్రెస్ ప్రకటించింది దళిత డిక్లరేషన్ కాదు ఫాల్స్ డిక్లరేషన్: కవిత
దళితుల పేరుతో కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించింది దళిత డిక్లరేషన్ కాదు పాల్స్ డిక్లరేషన్ అని విమర్శించారు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. మొదట కర్నాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు. అమిత్ షా ఖమ్మంలో రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని కవిత విమర్శించారు