హైదరాబాద్లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. నానక్రామ్గూడలోని ఓ నిర్మాణ సంస్థలో మహిళను రేప్ అండ్ మర్డర్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. మృతురాలు గౌలిదొడ్డి కేశవనగర్కు చెందిన కాశమ్మగా పోలీసులు గుర్తించారు. వేస్ట్ మెటీరియల్ తీసుకునేందుకు వచ్చిన మహిళను రేప్ చేసిన అనంతరం నిందితులు బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే శుక్రవారం మిస్సింగ్ కేసు కూడా నమోదైనట్లు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.