టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. కావలి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అధికార పార్టీ బెదిరింపులకు లొంగకుండా ప్రజలు టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. మరో రెండు రోజుల్లో లోకేష్ యాత్ర.. రెండు వేల కిలో మీటర్ల మైలురాయికి చేరుకోనుంది. లోకేష్ పాదయాత్ర సరికొత్త రికార్డ్ సృష్టిస్తుందంటున్నారు టీడీపీ నేత కావ్య కృష్ణారెడ్డి.