ఇక యువగళం ఏర్పాట్లను పర్యవేక్షించారు టీడీపీ నేత కేశినేని చిన్ని.విజయవాడలో నారా లోకేష్ యువగళం ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు కేశినేని చిన్ని.యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. అయితే వైసీపీ సర్కార్ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.రేపటి భవిష్యత్ కు లోకేష్ మాత్రమే భరోసా అని అన్నారు.