బ్రిటీష్ చట్టాలకు గుడ్ బై చెప్పిన కేంద్రం ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. CRPCకి బదులుగా భారతీయ న్యాయ సంహిత చట్టం, IPCకి బదులుకు భారతీయ నాగరిక్ సురక్షత సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ కు బదులుగా భారతీయ సాక్ష్య బిల్లును తీసుకొచ్చారు. ఈ మూడు బిల్లులకు లోక్సభలో ప్రవేశపెట్టారు హోంమంత్రి అమిత్ షా. బిల్లుపై అధ్యయనానికి స్టాండింగ్ కమిటీకి సిఫార్స్ చేశారు. గ్యాంగ్ రేప్కు 20 ఏళ్లు లేదా జీవితకాల శిక్ష విధిస్తున్నట్లు బిల్లుకు తీసుకొచ్చారు. మైనర్పై అత్యాచారం కేసులో ఊరిశిక్ష విధించనున్నారు.