కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రసంగించారు. మోదీ సర్కార్పై అవిశ్వాసం పెట్టారు... ఇంతకీ విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా? అని ప్రశ్నించారు. ఇండియా ఫుల్ఫామ్ కూడా ఆ కూటమిలోని సభ్యులకు తెలియదని విమర్శించారు. నేను సావర్కర్ కాను.. క్షమాపణలు చెప్పనని రాహుల్ అంటున్నారు.. ఆయన ఎప్పటికీ సావర్కర్ కాలేరని నిషికాంత్ దూబే అన్నారు.