నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభంకానుంది. అన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్,.సత్యదేవున్ని దర్శించుకుని పూజలు చేశారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసైనికులు భారీగా ఏర్పాట్లు చేశారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.