మధ్య ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ తరఫున ప్రధాని మోడీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. షాదోల్లో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో అయుష్మాన్ గ్యారంటీ కార్డు తాము ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్డు నమూనాను ప్రజలకు వివరించారు. మధ్యప్రదేశ్లో కోటి మందికి ఈ కార్డును ఇస్తామని అన్నారు. ఈ కార్డు ద్వారా ప్రజలకు 5 లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు అందిస్తామని ఆయన అన్నారు. పేదలకు మెడికల్ చెకప్ల కోసం ఈ కార్డును ప్రత్యేకంగా తెచ్చినట్లు ప్రధాని వివరించారు.