రాజస్థాన్ షికార్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ కిసాన్ నిధి నగదు విడుదల చేశారు. 14వ విడత కార్యక్రమంలో విడుదల చేసిన నగదుతో రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున జమ కానుంది. దీంతో పాటు యూరియా గోల్డ్ ని కూడా ప్రారంభించారు. దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రంగా మారుస్తామని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు వ్యవసాయ ముడి పదార్థాలు, భూసార పరీక్షలు, విత్తనాలు,ఎరువులు అందజేస్తామని మోదీ తెలిపారు.