తిరుపతి జిల్లా రేణుగుంటలోఉద్రిక్తత ఏర్పడింది. భవిష్యత్కు గ్యారెంటీ చైతన్య రథాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. యాత్ర ఆపాలంటూ... బస్సుకు నోటీసులు అంటించారు పోలీసులు. అయితే.. పోలీసుల ఆదేశాలను పట్టించుకోని టీడీపీ నేతలు.... బస్సు యాత్రను ప్రారంభించారు. శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వదంలాది బైక్ ర్యాలీ మధ్య బస్సు యాత్ర కొనసాగుతోంది.