ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు డిమాండ్ చేశాయి. ఆరు నెలలుగా రూ.వెయ్యి కోట్లు బకాయి పడినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. బకాయిలు రాక తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లేఖలో వెల్లడించింది. అలాగే నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే 3,200 చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచాలని కోరింది. ఈ లేఖపై జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.