ఎయిర్టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లడం లేదు. దీంతో ఎయిల్టెల్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నలింగ్ సమస్యలను పరిష్కరించడంలో ఎయిర్టెల్ యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో గత మూడు గంటల నుంచి మొబైల్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్టెల్ ఫోన్లు పనిచేయడం లేదు. సమస్య దేశ వ్యాప్తంగా ఉన్నట్టు సమాచారం వస్తోంది. ఎయిర్టెల్ కాల్స్ డ్రాప్ అవుతుండడంతో అత్యవసర పనుల్లో ఉన్నవారు ఆందోళనకు లోనవుతున్నారు.