రైతుల పట్ల రేవంత్కు ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుందని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. గాంధీభవన్లో దూరిన గాడ్సే రేవంత్రెడ్డి అంటూ పువ్వాడ హాట్ కామెంట్స్ చేశారు. వ్యవసాయం ఏనాడైనా చేశావా? అంటూ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్పై రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 3 గంటల కరెంట్ ఇస్తామని పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రచారానికి వస్తే కాంగ్రెస్ నేతల్ని రైతులు ఉరికించి కొట్టడం ఖాయమని హెచ్చరించారు.